Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి దాటిన ఒమిక్రాన్ కేసులు - ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:13 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయింది. తెలంగాణాలో కొత్తగా మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర మారింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య వెయ్యిదాటిపోయి 1270కు చేరింది. అయితే, ఈ వైరస్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 374 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, ఒమిక్రాన్ కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారడం ఇపుడు ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పాజిటివ్ కేసులు ఏకంగా 450కు చేరుకున్నాయి. అలాగే, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణాలో 62 చొప్పున నమోదై వున్నాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 16,764కు చేరాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,48,38,804కు చేరుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments