Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కలవరపెడుతున్న కరోనా... పెరుగుతున్న జేఎన్ 1 వేరియంట్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (11:48 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతుంది. గత కొన్ని రోజులుగా కోవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 358 కేసులు నమోదయ్యాయి. అలాగే, కేరళలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. జీఎన్ 1 కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2666కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 కేసుల గుర్తించిన నేపథ్యంలో కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది. 
 
తాజాగా కేరళ, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. ఇక కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments