Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కలవరపెడుతున్న కరోనా... పెరుగుతున్న జేఎన్ 1 వేరియంట్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (11:48 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతుంది. గత కొన్ని రోజులుగా కోవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 358 కేసులు నమోదయ్యాయి. అలాగే, కేరళలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. జీఎన్ 1 కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2666కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 కేసుల గుర్తించిన నేపథ్యంలో కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశ వ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది. 
 
తాజాగా కేరళ, కర్నాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ ప్రకారం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. ఇక కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments