Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:06 IST)
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతి చెందగా, 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 1862 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 0.84 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయనీ రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మరణాల సంఖ్య 1.21 శాతంగా ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments