దేశంలో మరింత దిగువకు కరోనా పాజిట్ కేసులు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (10:25 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది శుక్రవారం నాటి కేసుల కంటే 14.14 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్తగా 10,929 మంది కరోనా బారినపడటంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,683కు చేరింది. ఇందులో 3,37,37,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,46,950 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 4,60,265 మంది బాధితులు కరోనాతో కన్నుమూశారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతం ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 12,509 మంది కరోనా నుంచి కోలుకోగా, 392 మంది మృతిచెందారని వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో ఒక్క కేరళలోనే 6580 కేసులు, 314 మరణాలు ఉన్నాయని ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా శుక్రవారం 8,10,783 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. నవంబర్‌ 5 వరకు 61,39,65,751 నమూనాలకు పరీక్షలు చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments