దేశంలో రోజుకో రికార్డు నెలకొల్పుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:54 IST)
దేశంలో కరోనా వైరస్ రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఒక్క రోజులోనే ఏకంగా 75 వేలకు మించిన పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా గడచిన 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,83,948 మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో గురువారం వరకు మొత్తం 3,94,77,848 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులోనే 9,01,338  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments