Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రోజుకో రికార్డు నెలకొల్పుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:54 IST)
దేశంలో కరోనా వైరస్ రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఒక్క రోజులోనే ఏకంగా 75 వేలకు మించిన పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా గడచిన 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,83,948 మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో గురువారం వరకు మొత్తం 3,94,77,848 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులోనే 9,01,338  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments