Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పది వేలకు పైగా పాజిటివ్ కేసులు.. ఢిల్లీలోనే వైరస్ ప్రభావం అధికం..

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (10:15 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టు చప్పుడు కాకుండా పెరుగుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా పది వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో అత్యధికం ఢిల్లీలోనే నమోదు కావడం గమనార్హం. అదేసమయంలో గత మూడు రోజులుగా పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10542 మంది ఈ వైరస్ బారినపడినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేలు దాటిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేట్ 26.54 శాతానికి చేరిందని తెలిపింది. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, గత మూడు రోజులుగా కరోనా కొత్త కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. ఆదివారంతో గడిచిన 24 గంటల్లో 7633 మంది వైరస్ బారినపడగా, సోమవారం ఈ సంఖ్య 9111కి చేరింది. ఈ క్రమంలో కరోనా ప్రభావం తగ్గుతోందని అధికారులు తెలిపారు. అయితే, బుధవారం మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments