Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకండ్ వేవ్‌తో షేకవుతున్న జనం ... అప్రమత్తమైన కేంద్రం

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (09:32 IST)
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఫలితంగా లక్షకు పై చిలుకు కేసు కేసులు వెలుగు చూస్తున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మహారాష్ట్రలో అయితే, ప్రతి 5 నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
ముఖ్యంగా, గత మూడు రోజులుగా వరుసగా రోజూ దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశం మొత్తం ఆంక్షల చట్రంలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుధవారం జరుగుతున్న కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన కఠిన ఆంక్షలపై చర్చించనుంది. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
 
దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుంది. తొలుత 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. అనంతరం ఐఎమ్‌ఏ మార్గదర్శకాలతో 45 ఏళ్ల వయసు వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కరోనా ఉధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాలనే డిమాండ్‌ వినిపిస్తుంది. ఈ డిమాండ్‌పై కేంద్రం గతంలో స్పష్టత నిచ్చింది.
 
వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారిని రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్రం స్పష్టం చేసింది. 'కోరుకున్న వారికి టీకాలు వేయం.. అవసరమైన వారికే వేస్తాం' అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో సైతం దశల వారీగా టీకాలు వేస్తున్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కరోనా మరణాలను టీకాల ద్వారా సాధ్యమైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను కాపాడడం మరో లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments