ఇటలీని దాటేసిన భారత్.. జూన్ 8 నుంచి అన్ లాక్ పరిస్థితి..?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (09:48 IST)
కరోనా కేసుల విషయంలో భారత్ ఇటలీని దాటేసింది. భారత్‌లో కరోనా వైరస్ కేసులు 2.35 లక్షలు దాటాయి. ఇక భారత్‌లో మరణించిన వారి సంఖ్య 6600గా ఉన్నది. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. వలస కూలీల తరలింపు ప్రక్రియ మొదలైన తర్వాత.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 24 గంటల్లో 343 మంది ఈ వైరస్ సోకడంతో మృత్యవాత పడ్డారు.
 
మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటలీలో 2,34,531 మందికి వైరస్ సోకగా, భారత్ కేసుల సంఖ్య ప్రస్తుతం 2,36,117గా ఉన్నది. సుమారు 19 రాష్ట్రాల్లో కరోనా సోకిన కేసుల సంఖ్య నాలుగు అంకెలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 
 
దేశంలో నాలుగు విడతలుగా లాక్ డౌన్ విధించినా, ఐదవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నా రోజుకి సరాసరిన 9000 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌-19 కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం భారత్‌దే. జూన్‌ 8 నుంచి ప్రార్థనామందిరాలు, మాల్స్‌ వంటి వాటిని ప్రారంభిస్తూ ఉండడంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments