ఉద్యోగులను వెంటాడుతున్న కరోనా, కోనసీమలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (19:22 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్న అమలాపురం డివిజన్లో పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకగా, రాజోలు ప్రభుత్వ స్కూలులో ఏడుగురు ఉపాధ్యాయులకు కూడా కరోనా పోసిటీవ్ అని తేలింది.

తాజాగా అల్లవరం మండల తహశీల్దార్ సహా మరో నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కోనసీమలో గత ఐదు రోజుల నుంచి కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాగా, మిగతా డివిజన్ల కంటే అమలాపురం డివిజన్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు వెల్లడించారు.

ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలలో జన సమూహం ఏర్పడటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. స్కూళ్లలో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సోకిన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసామని, కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వసంతరాయుడు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments