Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మరో కరోనా కేసు... న్యూజిలాండ్‌లో సెల్ఫ్ ఐసోలేషన్

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (13:53 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మరో కరోనా వైరస్‌ పాజిటీవ్‌ కేసు నమోదైంది. ఇటలీ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌-19 పాజిటీవ్‌గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.
 
అలాగే, ఇటలీ నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు భావిస్తున్నారు. ధృవీకరణ కోసం వారి రక్త నమూనాలను పూణేలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించినట్లు తెలిపారు. జన సమూహా ప్రదేశాలకు ప్రజలు దూరంగా ఉండాల్సిందిగా అధికారులు మరోమారు విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు, కరోనా వైరస్ అనేక దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఆదివారం రాత్రి నుంచి దేశానికి వ‌స్తున్న వారెవ‌రైనా.. స్వ‌యంగా ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల‌ని ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. 
 
ఇప్పుడు క్ష‌మాప‌ణ‌లు చెప్పుకునే స‌మ‌యం కాదు అని, అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆమె అన్నారు. తాము అమ‌లు చేయ‌నున్న రూల్స్  ప్ర‌పంచంలోనే అత్యంత క‌ఠిన‌మైన‌వ‌ని ప్ర‌ధాని జెసిండా అన్నారు. 
 
కాగా, కివీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే త‌మ ఆదేశాల‌పై మ‌రో 16 రోజుల త‌ర్వాత స‌మీక్ష ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల నిత్యావ‌స‌రాల కోసం విమాన‌, ఓడ‌ల ద్వారా జ‌రిగే ర‌వాణాలు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌న్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments