Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల పరారీ.. బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు..?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (11:20 IST)
గాంధీ ఆస్పత్రిలో మరోసారి కరోనా బాధితులు కలకలం రేపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు పరారయ్యారు. పారిపోయిన నలుగురు చర్లపల్లి జైల్లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి నలుగురు కూడా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. దీంతో పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు స్పెషల్ టీంగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశారు. 
 
తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పారిపోయిన నలుగురు ఖైదీలు సోమసుందర్, పి. నర్సింహ, మొమహ్మద్ అబ్దుల్ అర్బాజ్, జావిద్‌గా సమాచారం. ఈ నలుగురు కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments