Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల పరారీ.. బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు..?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (11:20 IST)
గాంధీ ఆస్పత్రిలో మరోసారి కరోనా బాధితులు కలకలం రేపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు పరారయ్యారు. పారిపోయిన నలుగురు చర్లపల్లి జైల్లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి నలుగురు కూడా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. దీంతో పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు స్పెషల్ టీంగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం అడ్మిట్ చేశారు. 
 
తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పారిపోయిన నలుగురు ఖైదీలు సోమసుందర్, పి. నర్సింహ, మొమహ్మద్ అబ్దుల్ అర్బాజ్, జావిద్‌గా సమాచారం. ఈ నలుగురు కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments