కరోనా వైరస్ ట్రావెల్ బబుల్‌ విమాన సర్వీసులు.. ఐతే..?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:19 IST)
సింగపూర్-హాంకాంగ్ మధ్య వచ్చే నెల 26 నుంచి ఎంపిక చేసిన విమానాలతో కరోనా వైరస్ ట్రావెల్ బబుల్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిజానికి గతేడాదే ఈ రెండు నగరాల మధ్య క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ కారిడార్ ప్రారంభం కావాల్సి ఉంది. 
 
అయితే, హాంకాంగ్‌లో అప్పట్లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలు కావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా పోయింది. మూలనపడిన ఈ ప్రతిపాదనను మళ్లీ పట్టాలెక్కించాలని భావించిన ఇరు ప్రభుత్వాలు అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశాయి.
 
వచ్చేనెల 26న రెండు వ్యాపార కేంద్రాల మధ్య తొలి విమానం 200 మంది ప్రయాణికులతో బయలుదేరుతుంది. జూన్ 10 నుంచి ప్రతి రోజూ రెండు విమానాలు నడుస్తాయి. ఈ మేరకు కేథీ పసిఫిక్-సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. 
 
హాంకాంగ్ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ఫైజర్-బయోఎన్‌టెక్, సినోవక్ వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని రెండు డోసులు తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. 
 
అయితే, సింగపూర్ నుంచి వెళ్లే ప్రయాణికులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకుని ఉండాల్సిన అవసరం లేదు. అయితే, డిపార్చర్, అరైవల్ సమయంలో మాత్రం నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
 
కరోనా కారణంగా మూతపడిన విమానయానాన్ని తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు క్వారంటైన్-ఫ్రీ బబుల్స్ ప్రారంభిందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 
 
తైవాన్, పలావు దేశాలు గత నెలలో డెడికేటెడ్ ట్రావెల్ బబుల్ ప్రారంభించగా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దీనిని అనుసరించాయి. 
 
తాజాగా, సింగపూర్, హాంకాంగ్ దేశాల మధ్య క్వారంటైన్ ఫ్రీ ట్రావెల్ ప్రారంభం కానుంది. అయితే, ట్రేసింగ్ సాధ్యం కాదని ఇన్ఫెక్షన్లు ఒక వారంలో ఐదుకు మించితే మాత్రం ఈ ట్రావెల్ బబుల్‌ను రెండు వారాల పాటు రద్దు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments