Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం... అనేక మందికి పాజిటివ్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:09 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ రెండు ఆస్పత్రులకు చెందిన సిబ్బందిలో అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, పలువురు వైద్య, నర్సింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
గాంధీ ఆస్పత్రి అనుబంధ వైద్య కాలేజీలో 20 మందికి ఎంబీబీఎస్ విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. అలాగే 10 మంది హౌస్ సర్జన్లు, 10 మంది పీజీ విద్యార్థులు, నలుగురు ఫ్యాకల్టీ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో 44 మంది కోవిడ్ బారినపడ్డారు. 
 
ఇక ఉస్మానియా ఆస్పత్రిలోనూ కరోనా కలకలం చెలరేగింది. ఉస్మానియాలోని 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, 35 మంది హౌస్ సర్జన్లకు, 23 మంది జూనియర్ వైద్యులకు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ వైరస్ సోకింది. ఉస్మానియా వైద్య వర్గాల సమాచారం మేరకు ఈ ఆస్పత్రిలో మొత్తం 79 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో గాంధీ, ఉస్మానియా వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments