కరోనా టీకా తొలి డోసు వేయించుకున్న వైద్య విద్యార్థి మృతి!

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (14:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన టీకాల పంపిణీ దేశంలో జోరుగా సాగుతోంది. అయితే, ఈ టీకాలు వేయించుకున్న వారిలో కొందరు చనిపోతున్నారు. తాజాగా తొలి డోసు టీకా తీసుకున్న వైద్య విద్యార్థి కరోనాతో మరణించాడు. మరో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
బీహార్‌ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది. బెగుసారై జిల్లా దహియా గ్రామానికి చెందిన 23 యేళ్ల శుభేందు పాట్నాలోని నలంద మెడికల్‌ కాలేజ్, ఆసుపత్రిలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంబీబీఎస్‌ చివరి ఏడాది విద్యార్థి అయిన ఆయనకు గత నెల చివరి వారంలో కోవాగ్జిన్‌ టీకా తొలి డోసు వేశారు. అతడు రెండో డోసు తీసుకోవాల్సి ఉన్నది. 
 
కాగా, ఫిబ్రవరి 24న దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆ వైద్య విద్యార్థికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సొంతూరులోని తన ఇంటికి వెళ్లిన శుభేందు ఈ నెల ఒకటో తేదీన చనిపోయాడు. మరోవైపు అతడు ఉన్న కాలేజ్‌ హాస్టల్‌లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments