కరోనావైరస్ నిర్థారణ కోసం ఐ మాస్క్ బస్సులు, విజయవాడలో ప్రారంభం

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (14:19 IST)
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను ఏర్పాటు చేసింది.
 
అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షలను తీవ్రపరచింది.
 
విజయవాడలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నది. విజయవాడలో రోజుకు రెండు వేలమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చికిత్సతో కరోనా వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments