Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి పొంచివున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు!

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:18 IST)
దేశ‌రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుప‌డుతున్న‌ట్లు కనిపిస్తున్నప్పటికీ, థ‌ర్డ్ వేవ్‌పై ఐఐటి ఢిల్లీ విడుదల చేసిన నివేదిక భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా ఉంది. ఆ రిపోర్టు ప్ర‌కారం కరోనా థ‌ర్డ్ వేవ్‌లో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేల‌కుపైగా కేసులు న‌మోద‌వుతాయ‌ని అంచ‌నా. 
 
అలాగే ప్రతిరోజూ సుమారు తొమ్మిది వేల‌ మంది ఆసుపత్రిలో చేరే అవ‌కాశాలున్నాయి. 
ఈ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాల‌ని దానిలో సూచించారు. ఈ నివేదిక ప్రకారం అటువంటి పరిస్థితి తలెత్తితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంద‌ని అంచ‌నా. 
 
ఈ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే స‌న్నాహాలు ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధానిలో ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ... కేజ్రీవాల్ స‌ర్కారు కలిసి పనిచేస్తున్నాయి. 
 
ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ తయారు చేసిన బ్లూప్రింట్‌ను అమలు చేయడానికి సూచించిన చర్యలు ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గ‌తంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం కోర్టు... ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments