Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తినలో అన్‌లాక్.. దశల వారీగా అమలు : సీఎం కేజ్రీవాల్

Advertiesment
హస్తినలో అన్‌లాక్.. దశల వారీగా అమలు : సీఎం కేజ్రీవాల్
, శుక్రవారం, 28 మే 2021 (17:08 IST)
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీలో మొదటిసారి ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇపుడు ఈ నెల 31వ తేదీ నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభంకానుంది. కరోనా వైరస్ దెబ్బకు తల్లడిల్లిపోయిన ఢిల్లీ... ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ కారణంగా క్రమంగా కోలుకుంది. ఇపుడు అన్‌లాక్ ప్రక్రియను షూరూ చేయనున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు. 
 
అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఉత్పాదక యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు అనుమతిస్తామని.. అలాగే కనస్ట్రక్షన్ వర్కర్లకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు సీఎం కేజ్రివాల్ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, "చాలా సమస్యలను ఎదుర్కొన్న తర్వాత.. సెకండ్ వేవ్‌పై నియంత్రణ సాధించాం. అంటే దీని అర్థం కరోనాపై పోరాటం ముగిసినట్టు కాదు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 1.5 శాతం వద్ద ఉంది’ అని తెలిపారు. 
 
అన్‌లాక్ ప్రక్రియలో ముందుగా అట్టడుగు వర్గాలవారిని దృష్టిలో ఉంచుకోవాలని, వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అన్నారు. రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీలను తెరవడంతో పాటుగా, నిర్మాణ కార్యాకలాపాలను అనుమతించాలని నిర్ణయించినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందు పంపిణీపై పుకార్లు నమ్మొద్దు.. ఇంకా అనుమతులు రాలేదు : ఆనందయ్య