Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు కరోనా.. మరోవైపు భయపెడుతున్న డెంగ్యూ..

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కోరలు చాస్తుండగా.. మరోవైపు డెంగ్యూ భయపెడుతుంది. ఇప్పటికే డెంగ్యూ వ్యాధికి గురై పలువురు చనిపోయినట్లు సమాచారం. ఢిల్లీలో మూడేళ్ల నాటి డెంగ్యూ రికార్డులు బద్ధలవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ విస్తరిస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా డెంగ్యూ విస్తరిస్తుండటంతో అనేక మంది దవాఖానాల పాలవుతున్నారు. 
 
డెంగ్యూ కారణంగా ఇప్పటికే పలువురు మరణించినట్లు చెప్తున్నారు. 2018 తర్వాత అత్యధికంగా డెంగ్యూ రోగులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. గత వారంలో కొత్తగా నలుగురు డెంగ్యూతో చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. 2016, 2017లలో 10 మంది చొప్పున రోగులు చనిపోగా.. 2018 సంవత్సరంలో నలుగురు, ​​2019 లో ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. 2015లో అత్యధికంగా 60 మంది చనిపోయారు.
 
ఇదే సమయంలో మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు గణనీయంగా వ్యాప్తి చెందకపోవడం ఉపశమనం కలిగించే విషయం. గత వారంలో మలేరియా రోగులు ఎవరూ నమోదు కాలేదు. ఈ ఏడాది మొత్తం మలేరియా రోగుల సంఖ్య నాలుగుకు పెరుగగా, చికున్‌గున్యా రోగుల సంఖ్య మూడుకి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments