Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు కరోనా.. మరోవైపు భయపెడుతున్న డెంగ్యూ..

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కోరలు చాస్తుండగా.. మరోవైపు డెంగ్యూ భయపెడుతుంది. ఇప్పటికే డెంగ్యూ వ్యాధికి గురై పలువురు చనిపోయినట్లు సమాచారం. ఢిల్లీలో మూడేళ్ల నాటి డెంగ్యూ రికార్డులు బద్ధలవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ విస్తరిస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా డెంగ్యూ విస్తరిస్తుండటంతో అనేక మంది దవాఖానాల పాలవుతున్నారు. 
 
డెంగ్యూ కారణంగా ఇప్పటికే పలువురు మరణించినట్లు చెప్తున్నారు. 2018 తర్వాత అత్యధికంగా డెంగ్యూ రోగులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. గత వారంలో కొత్తగా నలుగురు డెంగ్యూతో చనిపోగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. 2016, 2017లలో 10 మంది చొప్పున రోగులు చనిపోగా.. 2018 సంవత్సరంలో నలుగురు, ​​2019 లో ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. 2015లో అత్యధికంగా 60 మంది చనిపోయారు.
 
ఇదే సమయంలో మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు గణనీయంగా వ్యాప్తి చెందకపోవడం ఉపశమనం కలిగించే విషయం. గత వారంలో మలేరియా రోగులు ఎవరూ నమోదు కాలేదు. ఈ ఏడాది మొత్తం మలేరియా రోగుల సంఖ్య నాలుగుకు పెరుగగా, చికున్‌గున్యా రోగుల సంఖ్య మూడుకి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments