కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు... జులై నాటికి 30 కోట్ల మందికి టీకా

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:05 IST)
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు శనివారం ప్రారంభమైంది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆ రోజున తొలి డోసు తీసుకున్న లబ్ధిదారులకు శనివారం నుంచి రెండో డోసు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ దేశంలో 77లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ యోధులు తొలి దశలో వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97 శాతం మంది టీకా పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
జులై నాటికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో 70 లక్షల మందికి టీకా ఇవ్వడానికి 26 రోజుల సమయం తీసుకుంటే అమెరికాలో 27 రోజులు, యూకేలో 48 రోజులు పట్టింది. 
 
దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 8 లక్షల మందికిపైగా టీకా తీసుకోగా తర్వాత మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో ఆరేసి లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకూ సీరమ్ తయారీ కొవిషీల్డ్‌, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వేస్తుండగా ఏప్రిల్‌లో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments