Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ - ఈ రోజు కేసులు ఎన్నంటే...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:22 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. ముఖ్యంగా, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 41,771 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. 
 
ఈ కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాలో 2,031, కర్నూలులో 1,835, విశాఖపట్టణంలో 1,349, గుంటూరులో 1,342, ప్రకాశంలో 1,259, తూర్పుగోదావరిలో 1,066, నెల్లూరు జిల్లాలో 1,007 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి 10,290 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 
 
అదేవిధంగా తెలంగాణాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 97,549 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 3,944 మందికి ఈ వైరస్ సోకింది. 2,444 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,372, మేడ్జల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హన్మకొండలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్ధిపేట జిల్లాలో 104, కొత్తగూడెం జిల్లాలో 101 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments