ఏపీలో కరోనా విజృంభణ.. మరో 80 కేసులు.. వైకాపా నేతలే కారణమా?

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (12:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో మరో 80 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1177కు చేరాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన 80 కరోనా కేసుల్లో కర్నూలులో 13, గుంటూరులో 23, కృష్ణాలో 33, వెస్ట్ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు చొప్పున నమోదయ్యాయి. 
 
అయితే, విజయనగరం జిల్లాలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,177కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో 53, చిత్తూరులో 73, ఈస్ట్ గోదావరి 39, గుంటూరు 237, కడప 58, కృష్ణ 210, కర్నూలు 292, నెల్లూరు 79, ప్రకాశం 56, శ్రీకాకుళం 4, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరిలో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తినికి ప్రధాన కారకులుగా వైకాపా నేతలేనంటూ ప్రచారం సాగుతోంది. కరోనా కిట్స్, ఆర్థిక సాయం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ పేరుతో వైకాపా నేతలు సామాజిక భౌతికదూరాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. ఈ కారణంగానే కరోనా వైరస్‌కు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 
 
తాజాగా కూడా కర్నూలు ఎంపీ కుటుంబంలో కూడా ఆరుగురు సభ్యులకు ఈ వైరస్ సోకింది. వీరిలో 89 యేళ్ళ ఎంపీ తండ్రి కూడా ఉన్నారు. ఈయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పైగా, ఈ ఆరుగురు సభ్యుల్లో నలుగురు వైద్యులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments