దేశంలో పెరిగిపోతున్న క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:36 IST)
దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా 20 వేలకు పైగా నమోదైన ఈ కేసులు మూడోరోజైన శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.40 లక్షలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,17,895 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,660కి చేరింది. ఇకపోతే, 18,301 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.48 శాతం) దాటింది.
 
వైరస్‌వ్యాప్తి పెరుగుతుండటం.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,40,760(0.32 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతూ 200 కోట్ల డోసులకు చేరువ కావడం విశేషం. ఇప్పటి వరకూ 199,71,61,438 డోసులు పంపిణీ చేశారు.
 
మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

తర్వాతి కథనం
Show comments