దేశంలో పెరిగిపోతున్న క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:36 IST)
దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా 20 వేలకు పైగా నమోదైన ఈ కేసులు మూడోరోజైన శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.40 లక్షలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,17,895 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,660కి చేరింది. ఇకపోతే, 18,301 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.48 శాతం) దాటింది.
 
వైరస్‌వ్యాప్తి పెరుగుతుండటం.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,40,760(0.32 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతూ 200 కోట్ల డోసులకు చేరువ కావడం విశేషం. ఇప్పటి వరకూ 199,71,61,438 డోసులు పంపిణీ చేశారు.
 
మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kurchi Madathapetti: కుర్చీ మడతపెట్టి.. కేవలం 425 రోజుల్లోనే 60 కోట్ల మార్కు

సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాలి : రజనీకాంత్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments