దేశంలో పెరిగిపోతున్న క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 16 జులై 2022 (10:36 IST)
దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా 20 వేలకు పైగా నమోదైన ఈ కేసులు మూడోరోజైన శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.40 లక్షలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,17,895 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,660కి చేరింది. ఇకపోతే, 18,301 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.48 శాతం) దాటింది.
 
వైరస్‌వ్యాప్తి పెరుగుతుండటం.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,40,760(0.32 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతూ 200 కోట్ల డోసులకు చేరువ కావడం విశేషం. ఇప్పటి వరకూ 199,71,61,438 డోసులు పంపిణీ చేశారు.
 
మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments