Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్?!

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీనికి నిదర్శనమే ఏపీలో కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్‌ స్పాట్‌లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే రాజ్‌భవన్‌లో ఇప్పటికే నలుగురికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో రాజ్‌భవన్‌ సిబ్బంది, అధికారుల్లో కలకలం మొదలైంది. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్ ప్రాంగణంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో అధికారుల్లో ఆందోళ‌న‌నెల‌కొంది. అక్కడ పనిచేసే ఉద్యోగితో పాటు, 108 అంబులెన్స్‌ డ్రైవరుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. 
 
గతంలో గవర్నర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇపుడు మరో ఇద్దరికి సోకడం ఆందోళన కలిగిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments