Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్?!

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీనికి నిదర్శనమే ఏపీలో కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్‌ స్పాట్‌లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజ్‌భవన్‌లో మరో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే రాజ్‌భవన్‌లో ఇప్పటికే నలుగురికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో రాజ్‌భవన్‌ సిబ్బంది, అధికారుల్లో కలకలం మొదలైంది. 
 
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్ ప్రాంగణంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో అధికారుల్లో ఆందోళ‌న‌నెల‌కొంది. అక్కడ పనిచేసే ఉద్యోగితో పాటు, 108 అంబులెన్స్‌ డ్రైవరుకు కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. 
 
గతంలో గవర్నర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఇద్దరు అటెండర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇపుడు మరో ఇద్దరికి సోకడం ఆందోళన కలిగిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments