Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ స్ట్రెయిన్ కలకలం..

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (13:07 IST)
తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్‌ మండలం తేటగుంట గ్రామంలో గురువారం కోవిడ్‌ స్ట్రెయిన్‌ కలకలం రేపింది. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. మరలా మార్చి 1న తుని లో పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇతనిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
అలాగే దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజు 14,989 కేసులు నమోదయ్యాయి. వీటితో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 1.11 కోట్లకు పైగా చేరాయి. కొత్తగా 89మంది మరణించారు. మొత్తం నిన్నటివరకు కరోనా కారణంగా 1,57,435 మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే 14,031 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనాను జయించినవారు 1.08 కోట్లకు పైబడగా.. ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న 7,75,631 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments