ఒమైక్రాన్‌ రూపంలో.. థర్డ్ వేవ్ ముప్పు వస్తోందా?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:13 IST)
ఒమైక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చేసిందని టాక్ వస్తోంది. అలాగే డెల్టాను మించిన వేరియంట్‌ వస్తేనే దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు హెచ్చరించారు. ఒమైక్రాన్‌ రూపంలో అలాంటిది వచ్చిందనే ఆందోళన కనిపిస్తోంది. 
 
గత పరిస్థితులను బేరీజు వేసి ఒమైక్రాన్‌ ప్రభావం మనపైనా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 11న ఒమైక్రాన్‌ను గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే.. చాలా ప్రమాదకారి రకంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కొవిడ్‌ వేరియంట్‌లలో దేన్నీ ఇంత తక్కువ కాలంలో అలా పేర్కొనలేదు. కేవలం వారం వ్యవధిలో ఒమైక్రాన్‌ వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది.  కాబట్టే.. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
 
దేశంలో సెకండ్‌ వేవ్‌లో డెల్టా కారణంగానే 2.5 కోట్ల కేసులు నమోదై, 2 లక్షలపైగా మరణాలు సంభవించాయి. ఒమైక్రాన్‌ వ్యాపిస్తే ముప్పు మరింత ఎక్కువని ఆందోళన వ్యక్తమవుతోంది.
 
డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం, విమాన సర్వీసులపై దేశాలు ఆంక్షలు విధిస్తుండడం బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసిపోతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments