Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్, విషమంగా మారిన డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోగ్యం

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:48 IST)
లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ కోవిడ్ 19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనావైరస్‌తో పాటు డెంగ్యూతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్, డెంగ్యూ కారణంగా సిసోడియా ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. ఆయన రక్త ప్లేట్‌లెట్లు కూడా పడిపోతున్నాయని కూడా తెలిపింది.
 
సిసోడియా బుధవారం ప్రభుత్వ ఎల్ఎన్జెపి ఆస్పత్రిలో చేరారు. జ్వరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆయన చికిత్స కోసం చేరినట్లు తెలిపింది. అయితే తాజాగా సిసోడియాను మెరుగైన వైద్యం కోసం ఎల్ఎన్‌జెపి హాస్పిటల్ నుంచి సాకేత్ లోని మాక్స్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు ఆస్పత్రి హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
 
సెప్టెంబరు 14న మనీష్ సిసోడియా కరోనా బారిన పడ్డారు. దాంతో అప్పటి నుంచి సెల్ప్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని మంత్రివర్గంలో కోవిడ్ 19కు పాజిటివ్‌గా పరీక్షించిన రెండవ మంత్రి మనీష్ సిసోడియా, జూన్‌లో డిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరారు. 12 రోజుల పాటు చికిత్స పొంది జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments