Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నా తిప్పలు.. స్టెరాయిడ్స్‌తో కంటి చూపు గోవిందా!

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:01 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడి.. ఆపై కోలుకున్న వారిపై జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య నిపుణులు కరోనాను తగ్గించడానికి వాడే మందుల వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు చెప్పారు.
 
కరోనా చికిత్సలో భాగంగా వినియోగిస్తున్న స్టెరాయిడ్స్ వల్ల కోలుకున్న వారిలో కంటిచూపు మందగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని స్టెరాయిడ్స్ లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్స్‌ను చూపిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎలాంటి కంటి సమస్యలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
 
డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులతో బాధ పడేవాళ్లకు స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తే మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తే స్టెరాయిడ్స్ ఇస్తారని.. ఆ స్టెరాయిడ్స్ భవిష్యత్తులో చాలా సైడ్ ఎఫెక్ట్స్‌ను చూపుతాయని వెల్లడించారు. స్టెయిరాడ్స్ తీసుకున్న వాళ్లు కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments