Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత, 3,967 కొత్త కేసులు, 25 మరణాలు

Advertiesment
ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత, 3,967 కొత్త కేసులు, 25 మరణాలు
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:20 IST)
తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో కరోనా పెరుగుతూ వచ్చినా ప్రస్తుతం దాని తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సాధారకణ పరిస్థితులు నెలకొనే విధంగా పురోగతి కనిపిస్తోంది. గత కొన్ని నెలల కిందట పరిస్థితులతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమంత తీవ్రంగా లేదని తెలుస్తోంది.
 
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,967 పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 627 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి నిర్ధారణ అయ్యింది. తాజాగా 5,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసు ల సంఖ్య 7,75,470కి చేరగా 7,30,109మందికి కరోనా నయం అయ్యింది. ఇంకా 38,979 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,382కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కీచక ఫాస్టర్ దొరికాడు, పోలీసుల చేతిలో దబిడి దిబిడే..?