Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యాట్సాఫ్ ఎస్పీ, అత్యాచారం బాధితురాలికి ఆర్థిక సహాయం

హ్యాట్సాఫ్ ఎస్పీ, అత్యాచారం బాధితురాలికి ఆర్థిక సహాయం
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:05 IST)
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. తన జీతంలో విద్యార్థులకు విద్య కోసం సగం డబ్బులను ఇస్తూ ఆపదలో ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక సహాయం చేస్తుంటారు ఎస్పీ రమేష్ రెడ్డి.
 
కరోనా సమయంలో రైతుల పొలాల వద్దకు వెళ్ళిన ఎస్పీ వారు పడుతున్న బాధలు చూసి నిత్యావసర వస్తువులను అందజేశారు. వారిని ఆర్థికంగా అందుకున్నారు. ఇలా తనలోని దయాగుణాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు ఎస్పీ.
 
సరిగ్గా రెండురోజుల క్రితం తిరుపతిలో ఒక ఫాస్టర్ చేతిలో యువతి అత్యాచారానికి గురైంది. అసలే నిరుపేద కుటుంబం కావడం.. బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనతో ఎస్పీ దగ్గర గోడు వెల్లబోసుకుంది. దీంతో ఎస్పీ చలించిపోయారు. బాధితురాలికి తన వంతు సాయంగా 25 వేల రూపాయలను అందజేశారు. 
 
స్వయంగా తన జీతంలోని సగాన్ని 25వేల రూపాయలను చెక్కు రూపంలో బాధితురాలి తల్లికి అందించారు ఎస్పీ. ఎస్పీ సహాయాన్ని అభినందిస్తున్నాయి ప్రజా సంఘాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నానం చేస్తుండగా ప్రసవం.. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి విసిరేసిన మహిళ... ఎక్కడ?