Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీటితో స్నానం చేస్తే కరోనా చెక్ : కేంద్రం క్లారిటీ

Webdunia
గురువారం, 13 మే 2021 (12:11 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు తమకు తోచిన విధంగా స్వీయరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా వేడి నీటితో స్నాం చేస్తే కరోనా రాదన్న ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా వాస్తవ దూరమైన ప్రచారమని స్పష్టం చేసింది.
 
ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వైరస్ మరణిస్తుందని తెలిపింది. అయితే, వేడినీళ్ల వల్ల శరీరానికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా అందుతుంది.
 
గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ తెలిపింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, జీర్ణవ్యవస్థ పెరుగుతుందని పేర్కొంది. 
 
అంతేకానీ వేడి నీళ్లు వల్ల కరోనా పోతుందన్న వార్తల్లో నిజం లేదని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments