ఏపీలో కరోనా మృత్యుఘంటికలు : 24 గంటల్లో 68 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 68 మంది చనిపోయారు. అలాగే కొత్త కేసుల నమోదులో కూడా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రతి రోజూ ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10,175 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1,412 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,386 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,37,687కి పెరిగింది. ఇదేసమయంలో గత 24 గంటల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,702 మంది కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 72,229 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం జి్లాలో 4966 కేసులు ఉండగా, చిత్తూరులో 8747, ఈస్ట్ గోదావరిలో 12763, గుంటూరులో 7803, కడపలో 7942, కృష్ణలో 3051, కర్నూలులో 4438, నెల్లూరులో 5782 చొప్పున ఉన్నాయి.
 
అలాగే, ప్రకాశంలో 15099, శ్రీకాకుళంలో 6657, విశాఖపట్టణంలో 6023, విజయనగరంలో 9314, వెస్ట్ గోదావరిలో 4663 చొప్పున మొత్తం 97338 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4702 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments