దేశంలో కరోనా సునామీ : నవంబరు థర్డ్ వేవ్?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:34 IST)
దేశ వ్యాప్తంగా కరోనా సునామీ కొనసాగుతోంది. ఈ రెండో దశ వ్యాప్తితో దేశ ప్రజలంతా తల్లడిల్లిపోతున్నారు. ఈ రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో వేవ్‌ నుంచి తప్పించుకోవాలంటే 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాలని కోరుతున్నారు. 
 
ఈ ఏడాది నవంబరు నాటికి రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మొదటిసారి వచ్చింది పెద్ద వేవ్‌ కానే కాదని, ఇప్పుడు వచ్చిందే అసలైన వేవ్‌ అని పేర్కొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకా వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 
 
అయినప్పటికీ అంచనాలకు తగ్గట్లుగా ప్రజలు టీకా తీసుకోవడం లేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఆ వయసు పైబడిన వారు 2.62 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. ప్రజలు టీకా తీసుకోకపోతే 6 నెలల్లో థర్డ్‌ వేవ్‌ తప్పదని హెచ్చరిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

తర్వాతి కథనం
Show comments