Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విస్తరిస్తున్న కరోనా, 110 కేసులు నమోదు, ఇటలీలో ఒక్కరోజే 350 మంది మృతి

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (14:57 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ - COVID 19 ప్రపంచంలో ఇప్పటివరకూ 157 దేశాలకు వ్యాపించింది. చైనాలో దీని ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో అక్కడ క్రమంగా షాపులు తెరుచుకుంటున్నాయి. కానీ భారతదేశం పైన కరోనా పంజా విసురుతోంది. మరోవైపు ప్రపంచంలోని దేశాలలో ఇటలీ కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతోంది. నిన్న ఒక్కరోజే 350 మందికి పైగా ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. దీనితో ఇటలీలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
మన దేశం విషయానికి వస్తే ఆదివారం నాడు ఒక్కరోజే 11 మందికి కొత్తగా కరోనా వైరస్ అంటుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. జనవరి 30 నుంచి మార్చి 16 వరకు మన దేశంలో 110 కేసులు నమోదవగా అందులో 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరు ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఇక 12 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారణై ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వాలు కరోనా వైరస్ అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments