భారత్‌లో కరోనా ప్రభావం .. కోటి మందిలో ఏడుగురికి సోకిన వైరస్

Webdunia
ఆదివారం, 29 మార్చి 2020 (09:02 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. ఈ వైరస్ ఇప్పటికే 199 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ మహమ్మారిబారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తితో పాటు ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆదివారం ఉదయానికి ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. 
 
మరోవైపు, కేసులు/జనాభా నిష్పత్తి ఆధారంగా విశ్లేషిస్తే.. మన దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 0.7 మందికి మాత్రమే వైరస్‌ సోకింది. అంటే.. కోటి మందిలో ఏడుగురు బాధితులు ఉన్నట్టు లెక్క. సమూహవ్యాప్తి దశకు చేరకముందే వైరస్‌ను కట్టడి చేస్తేనే సురక్షితంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం లాక్‌డౌన్‌తోపాటు అనేక ఏర్పాట్లు చేస్తోంది. 
 
మరోవైపు, కరోనా పోరాటంలో రైల్వే శాఖ కూడా తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రైలు బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చుతోంది. ఓ జనరల్‌ బోగీని ఐసొలేషన్‌ వార్డుగా మార్చిన చిత్రాలను శనివారం మీడియాకు విడుదలచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments