Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: వారం వ్యవధిలో రెండో భారీ తగ్గుదల, 24 గంటల్లో 16,504 కొత్త కేసులు

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (15:41 IST)
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. మరోవైపు కోలుకొన్న కేసుల సంఖ్య కోటికి చేరువవుతోంది. మరోవైపు కొవిడ్ టీకాలకు ఆమోదం లభించడంతో దేశంలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
 
తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 16,504 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో వారం రోజుల వ్యవధిలో రెండోసారి అత్యల్ప కేసులు వచ్చాయి. డిసెంబర్ 28 తరవాత ఈ తగ్గుదల నమోదైంది. కాగా, నిన్నటితో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,469కి చేరింది.
 
నిన్న 7,35,978 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే, కేసుల సంఖ్య తగ్గడానికి కరోనా పరీక్షల్లో తగ్గుదల కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.
 
ఇక క్రియాశీల కేసులు 2.5లక్షలకు దిగువనే కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు దేశంలో 2,43,953 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 2.39శాతానికి చేరింది.
 
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 99,46,867 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.16 శాతంగా ఉంది. మరోవైపు గత 10రోజులుగా మరణాలు 300 దిగువనే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 214 మంది ఈ మహమ్మారికి బలికాగా.. మొత్తం మరణాల సంఖ్య 1,49,649గా ఉంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments