Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటార్కిటికాలో తొంగిచూసిన కరోనా.. 58మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:21 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కానీ ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకు వణికితే ఒక్క ఖండం మాత్రమె ఆ టెన్షన్ లేకుండా ఉంది. అదే అంటార్కిటికా. ఇప్పటి దాకా ఆ ఖండం మీద ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ఈ ఖండంలో శాశ్వతంగా ఎవరూ నివసించరు. కొద్ది మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే అక్కడ ఉంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. అది ఒకటి రెండు కాదు ఏకంగా 58 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా కథనాలు వెలువరించింది.
 
ఇక నివారణ చర్యలు చేపట్టామని కూడా చిలీ ఆర్మీ ప్రకటన చేసింది. రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వారి ద్వారానే ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కోంది. కరోనా కేసులు నమోదు కావడంతో అంటార్కిటికాలోని అన్ని ప్రధాన రీసెర్చ్ ప్రాజెక్టులను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments