Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటార్కిటికాలో తొంగిచూసిన కరోనా.. 58మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:21 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చేసింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌తో మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కానీ ప్రపంచమంతా కరోనా వైరస్‌ దెబ్బకు వణికితే ఒక్క ఖండం మాత్రమె ఆ టెన్షన్ లేకుండా ఉంది. అదే అంటార్కిటికా. ఇప్పటి దాకా ఆ ఖండం మీద ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ఈ ఖండంలో శాశ్వతంగా ఎవరూ నివసించరు. కొద్ది మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే అక్కడ ఉంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. అది ఒకటి రెండు కాదు ఏకంగా 58 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని సైనికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా కథనాలు వెలువరించింది.
 
ఇక నివారణ చర్యలు చేపట్టామని కూడా చిలీ ఆర్మీ ప్రకటన చేసింది. రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వారి ద్వారానే ఇది వ్యాపించి ఉండవచ్చని పేర్కోంది. కరోనా కేసులు నమోదు కావడంతో అంటార్కిటికాలోని అన్ని ప్రధాన రీసెర్చ్ ప్రాజెక్టులను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments