తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. తెలంగాణలో 181, ఏపీలో 210 కేసులు

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (18:53 IST)
ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత 24 గంటల్లో 210 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి. 41 కేసులతో తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో ఉంది. 
 
విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,388కి చేరుకున్నాయి. 7,180 మంది ఇప్పటి వరకు మృతి చెందారు.
 
తెలంగాణలో కొత్త‌గా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ  వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 163 మంది కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,717కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,195 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,650గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,872 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 733 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 44 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments