దేశంలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:25 IST)
దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. 
 
మంగళవారం 4 వేలకు పైగా మరణాలు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 4,529 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా 3,89,851 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,96,330కి పెరిగాయి.
 
కాగా, ఇప్పటివరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. మొత్తం 2,83,248 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. 
 
ఇప్పటివరకు టీకా డ్రైవ్‌లో భాగంగా 18,58,09,302 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలావుండగా.. నిన్న భారీగా కొవిడ్‌ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20.08లక్షల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments