Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒకే రోజు 96424 పాజిటివ్ కేసులు ..

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:08 IST)
దేశంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ‌త 10 రోజులుగా ప్ర‌తిరోజూ 90 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. తాజాగా మ‌రో 96424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలు దాటిపోయింది. 
 
ఇందులో 10,17,754 కేసులు యాక్టివ్‌గా ఉండగా, క‌రోనా బారిన‌ప‌డినవారిలో‌ మ‌రో 41,12,552 మంది కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉద‌యం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కు క‌రోనాతో కొత్తగా 1174 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 84,372 మంది బాధితులు చ‌నిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ ప్ర‌క‌టించింది. 
 
మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయ‌ని తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 వేలలోపే యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనే 49 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. అయితే మ‌ర‌ణాల రేటు ఒక శాతం త‌గ్గి ప్ర‌స్తుతం 1.64 శాతంగా ఉంద‌ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments