Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసి మరణ మృదంగం.. ఏపీలో 96 మంది మృతి

Webdunia
శనివారం, 8 మే 2021 (20:20 IST)
దేశంలో కరోనా రక్కసి మరణ మృదంగం కొనసాగుతోంది. ఒక్కరోజులో నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించిన మూడో దేశంగా ఉంది. గతంలో అమెరికా, బ్రెజిల్‌లోనే ఒకరోజులో నాలుగువేలకు పైగా మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోరోజూ నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 4,187 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు, మరణాల సంఖ్య 2,38,270కు చేరుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. 
 
గత 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా, రికవరీ రేటు 81.95శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా, క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.
 
ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ కొత్తగా 20,065 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి రికార్డు స్థాయిలో 96 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 12,65,439కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 8,615 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01, 571 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments