Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు.. ఏపీలో తగ్గిన కేసులు

Webdunia
శనివారం, 8 మే 2021 (13:57 IST)
దేశంలో గత 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభమైన కరోనా రెండో వేవ్‌లో ఇప్పటివరకు 1,09,68,039 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 82 వేల మంది కరోనాతో మరణించారు. కాగా దేశంలో కరోనా కేసులు గతేడాది జనవరి 30న ప్రారంభమయ్యాయి. 
 
అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే తొలి దశలో కోటి కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే, రెండో దశలో కేవలం 82 రోజుల్లోనే కోటి 10 లక్షల కేసులు రికార్డయ్యాయి.
 
ఏపీలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 17,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో 12,749 మంది కోలుకున్నారు. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 12,45,374కు పెరిగాయి. 10,50,160 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,86,695కు చేరాయి. 8519 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో లక్షా 424 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments