Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaccine@58.82 కోట్లు.. ఈ రోజు కొత్త కరోనా కేసులెన్ని?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:13 IST)
దేశంలో కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58.82 కోట్ల మందికిగా పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర కుంటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందిన క సమాచారం మేరకు 56,10,116 మోతాదులు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఈ నెల 23 నాటికి టీకా డ్రైవ్‌ 220వ రోజుకు చేరింది. సోమవారం 39,62,091 మంది లబ్ధిదారులకు మొదటి డోస్‌ ఇవ్వగా.. 16,48,025 మంది రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి 58,82,21,623 డోసులు పంపిణీ చేయగా.. ఇందులో 45,55,21,465 మందికి తొలి.. మరో 13,27,00,158 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. 
 
సోమవారం 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments