Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా బీభత్సం - రాత్రి కర్ఫ్యూ - వారాంతాల్లో లాక్డౌన్

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (20:13 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క మహారాష్టరోనే 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. 
 
అంతేగాకుండా వారాంతాల్లోనూ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఐదుగురు, అంతకుమించి గుమికూడరాదని తెలిపింది.
 
ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. 
 
ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు 
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహంచగా 1,730 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments