Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా బీభత్సం - రాత్రి కర్ఫ్యూ - వారాంతాల్లో లాక్డౌన్

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (20:13 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క మహారాష్టరోనే 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. 
 
అంతేగాకుండా వారాంతాల్లోనూ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఐదుగురు, అంతకుమించి గుమికూడరాదని తెలిపింది.
 
ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. 
 
ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు 
 
మరోవైపు, ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహంచగా 1,730 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments