Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ధనవంతులనే కాటేస్తుంది ... తమిళనాడు సీఎం

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (09:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కరోనా వైరస్ వ్యాధి కేవలం ధనవంతుల వ్యాధి అని, ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆయన స్పందిస్తూ, ఈ కరోనా వైరస్‌ను ధనవంతులే రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. పైగా, ఈ వైరస్ ధనవంతులకే సోకుతుందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిచన వారి ద్వారానే ఈ వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని ఆయని చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.
 
కాగా, తమిళనాడులో గురువారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments