Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1594.. తెలంగాణాలో 6 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:47 IST)
దేశంలో కొత్తగా మరో 1594 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 51 మంది మరణించారని తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 29,974కి చేరాయి. 
 
అలాగే, దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. ప్రస్తుతం 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర (8,590), గుజరాత్ ‌(3,548), ఢిల్లీ (3,108), మధ్యప్రదేశ్ ‌(2,368), రాజస్థాన్‌ (2,262) రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్తగా నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1,009కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెలంగాణలో 42 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 25 మంది మృతి చెందారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments