Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా తగ్గుముఖం.. 9వేలకు దిగువన కేసులు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (12:54 IST)
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు 9 వేలకు దిగువన నమోదవ్వడం ఊరట కలిగించే అంశం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 11,07,617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,865 కేసులు బయటపడ్డాయి. 
 
తొమ్మిది నెలల కనిష్ఠానికి కేసుల సంఖ్య చేరింది. తాజాగా 197 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 3,44,56,401 మంది కరోనా బారిన పడగా... ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,852కి చేరింది. 
 
కేరళ రాష్ట్రం నుంచే 4,547 కేసులు..57 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 11,971 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.27 శాతానికి చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 1,30,793కి తగ్గి.. యాక్టివ్‌ కేసుల రేటు 0.38 శాతానికి పడిపోయింది. సోమవారం ఒక్కరోజే 59,75,469 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,12,97,84,045కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments