Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తోన్న కోవిడ్: 24గంటల్లో కొత్తగా 68వేల కేసులు

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (10:55 IST)
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్‌ తర్వాత ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది. ఇందులో 1,13,55,993 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 1,61,843 మంది మరణించారు.
 
కాగా, కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో దేశంలో యాక్టివ్‌ కేసులు ఐదు లక్షలు దాటాయి. మొత్తం కేసుల్లో 5,21,808 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే ఆదివారం మహమ్మారి వల్ల 291 మంది మరణించగా, మరో 32,231 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 6,05,30,435 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించింది.
 
దేశ వ్యాప్తంగా 24,18,64,161 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో మార్చి 28న 9,13,319 నమూనాలను పరీక్షించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments