Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గట్లేదు..

Webdunia
శనివారం, 29 మే 2021 (09:59 IST)
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,660 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే 30 మంది చనిపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 14,429 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించింది. కరోనా లక్షణాలతో 103 మంది చనిపోయారు. మరో 20,746 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,80,362 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,291, తూర్పుగోదావరిలో 2,022 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 535, శ్రీకాకుళంలో 897 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున, విశాఖపట్నంలో పది, నెల్లూరులో తొమ్మిది, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎనిమిదేసి, గుంటూరు, విజయనగరంలలో ఏడుగురేసి, శ్రీకాకుళంలో ఆరుగురు, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురేసి, ప్రకాశంలో ఇద్దరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10,634కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.దేశంలో కరోనా కొత్త కేసుల నమోదులో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments