Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:17 IST)
ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన వైద్యుల సంఖ్య ఢిల్లీలో మూడుకు చేరింది. ఇప్పటికే కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చిన ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిని పూర్తిగా మూసివేసి, ఆమెతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 
 
మరోవైపు, తాజాగా మరో ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకింది. వారిద్దరూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెసిడెంట్‌ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ కరోనా రోగులు ఉంచిన ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ ఇద్దరు వైద్యులు మహిళలే. ఒకరు కోవిద్-19 యూనిట్‌లో పని చేస్తున్నారు. మరొకరు జూనియర్ మహిళా వైద్యురాలు. ఈమె బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతోంది. 
 
అయితే, ఈ జూనియర్ వైద్యురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లివచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిద్దరూ ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments