Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (16:17 IST)
ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన వైద్యుల సంఖ్య ఢిల్లీలో మూడుకు చేరింది. ఇప్పటికే కేన్సర్ ఆస్పత్రిలో పని చేస్తూ వచ్చిన ఓ మహిళకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిని పూర్తిగా మూసివేసి, ఆమెతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 
 
మరోవైపు, తాజాగా మరో ఇద్దరు వైద్యులకు ఈ వైరస్ సోకింది. వారిద్దరూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రెసిడెంట్‌ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ కరోనా రోగులు ఉంచిన ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఈ ఇద్దరు వైద్యులు మహిళలే. ఒకరు కోవిద్-19 యూనిట్‌లో పని చేస్తున్నారు. మరొకరు జూనియర్ మహిళా వైద్యురాలు. ఈమె బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతోంది. 
 
అయితే, ఈ జూనియర్ వైద్యురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లివచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిద్దరూ ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments