Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు - కోవిడ్ కేసులు కూడా...

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (10:20 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఈ కేసుల సంఖ్య 1431గా ఉంటే గడిచిన 24 గంటల్లో ఈ కేసులు 1,525కు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏకంగా 27,553 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్ సోకి 284 మంది చనిపోయారు. అలాగే, 9,279 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిజానికి గత 15 రోజుల క్రితం వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువున మాత్రమే నమోదవుతూ వచ్చాయి. కానీ, సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వెలుగు చూసిన తర్వాత ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 27553 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments